పోరాడితే పోయేదేమిటో? మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.3 comments
- అల్లం నారాయణ
ఔ ను కామ్రేడ్స్.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఒకటా రెండా.. నూటపదకొండు సమస్యలచిక్కుముడుల మధ్య చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. దరిద్రంగా ఉంది. రైతులు నాగేటి చాళ్ళలో మృత్యుసేద్యం చేస్తున్నారు. పేదలు పేదలుగానే, ధనికులు మరింత ధనికులుగానే… ఉన్నో డు ఉన్నతికి,లేనోడు అధఃపాతాళానికి పోతానే ఉన్నారు. నిజమే కామ్రేడ్స్…కమ్యూనిస్టుపార్టీ పుట్టి దశాబ్దాలు గడిచిపోయినా, ఏదీరాలేదు. ఏదీపోలేదు. సోషలిజం వీధుల్లో మూర్ఛనలు పోతూనే ఉన్నది. వరల్డ్బ్యాంక్ తోలుబొమ్మలాటలో ఏలికలు తైతక్కలాడుతూనే ఉన్నారు. కొంత నెత్తుటి తర్పణా జరిగింది. కొన్నివేలమంది వీరులూ మరణించారు.
కూలిన గులాబీ తోట మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
ఏటా కోటీ ఇరవైలక్షల మంది నీ గులాబీతోటను తొక్కుకుంటూ తోసుకుంటూ ఎగిరిపోతారిక లోహవిహంగాల రెక్కలపైన. నీ ఎకరం గులాబీ తోట పక్కవాళ్ళ వందలాది ఎకరాల చేనుచెలక, ఆ పక్కవాళ్ళ కూరగాయల మళ్ళను మాయం చేసి నాలుగున్నర కిలోమీటర్ల పెట్టున వేసినారు చూడు… అది రన్వే. అతి పొడవైనది. అదొక కొండచిలువకూడా. దానికడుపులో దాగున్న నీ గులాబీతోట, వేల ఎకరాల తోటలు వాడిపోయినయ్. ఆవుల చంద్రమ్మా, సుభద్ర, రాజవ్వ, మల్లవ్వ, రాజపోషవ్వ పేరేదైతేనేం భూమి పుత్రికా. ఎవరో ఒకరు ఎగిరిపోవడానికి నేలమీద వేళ్ళూనుకున్న మీలాంటి లక్షలాదిమంది నేలబంధం తెగిపోవడం ఎవరికి మాత్రం ఎందుకు పడుతుంది లక్ష్మక్కా! తలకిందులుగా చూసినప్పుడు కదా… కొంచెమైనా అసలు సత్యం బోధపడేది.
తాజా మృత్యుగీతం మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
ఫ్రెష్.. రిలయన్స్ ఫ్రెష్..కాదు.. ఇప్పుడు రైతులను తవ్వి తలబోసుకుంటున్న మాజీ ఏలికగారి హెరిటేజ్ ఫ్రెష్ కూడా కాదు. నెత్తిన ఫ్రెష్గా తలపాగాతో, కంకాళాల మీద కూచొని తాజాగా రైతు ప్రవచనాలు వల్లిస్తున్న ‘మెస్సయ్య’ గురించీ నేను మాట్లాడడం లేదు. తాజా గా మరణించిన నాగలి మోసిన క్రీస్తురైతు గురించి చెబుతు న్నా. 60వేల కోట్ల రుణాల మాఫీకి ముందే బంధవిముక్తుడైన ఒక కరీంనగర్ రైతు ‘ఫ్రెష్డెత్’ గురించిన వారెంట్ ఇది. బహుశా ఇప్పటికిప్పుడు.. ఒకరు రాజీనామా చేస్తే మరొకరికి ‘డెత్వారెంట్’ అవుతుందన్న విషయమూ మాట్లాడడం లేదు. 60 వేల కోట్ల రుణాల మాఫీ తాజా ఆత్మహత్యలనెందు కు ఆపలేదన్నది జవాబులేని ప్రశ్న కూడా కాదు. అతను పత్తి పండించనప్పుడు పత్తి ధరలు వెలుగులు చిమ్మింది. అతను మిర్చితో విసిగిపోయినప్పుడు మిర్చి ధర ‘రెడ్’ మార్క్ దాటింది.
జనవనం మనాది మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
కన్నెపల్లి అడవిలో దాగున్న రహస్యం. ములుగు రోడ్డు పంటపొలాలను మోసుకుంటూ, గోవిందరావుపేట, పసి రె దాటితే నార్లాపూర్ మలుపు రోడ్డు విస్తరించి ఉన్నది. నీటి వనరున్నచోట కాకాతీయుల కళాశిల్ప వైభవంగా చరిత్రలో విలసి ల్లిన గుడికి దూరంగా రోడ్డు. రామప్పలేక్. రెండు కొండలు అటూ ఇటూ సమున్నతంగా నిలుచుండగా మధ్యలో పురా విశ్వాసాల మట్టికట్ట. జల సముద్రం. రోడ్డుపొంట దూరంగా బ్యాక్ వాటర్స్. కొంచెం నల్లగా, నీలిగా ఆ నీటి వనరు అధరువు గా అక్కడక్కడా పచ్చటి పంట పొలాలు. గోవిందరావుపేట, పసిరెలు రెండూ తొలి వలస ప్రాంతాలు. బహుశా ఈ గిరిజన సమూహాల్లోకి, మేడారం జాతర సాన్నిహిత్యంలోకి వచ్చిన ఈ ఆంధ్ర ప్రాంతపు వలసలు రామప్ప చెరువు ఆయకట్టు వల్ల వచ్చి ఉంటాయి. నార్లాపూర్ అటవీ పరిమళం అడవి విస్తరించిన మేరా. కొట్టేసిన చెట్ల ఖండిత మొండాలు.
సృష్టికర్తల విలాపం మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
త్రిశంకు స్వర్గం. ఇంకా అయిపోని తాండవం. ఉత్త తాపడాల తో ఏమి ఒరుగుతుంది. ఉత్త పూతలతో ఏ రోగం నయమవుతుందని? అంతం కానిదిది. ఆరంభం కూడా కాదు. చాలా దూరం గడిచి వచ్చిన తర్వాత చేతివృత్తుల చేతులిరగడం గురిం చి కదా…చితి చింత. సిరిసిల్ల గుల్లగుల్లయిపోయి, వాకిళ్ల మొలచిన రాళ్లబండలైపోయిన బతుకుల్ల అగ్గిమల్లే ఎట్లా పుట్టిందో? ఎన్నని చెప్పను. ఏది మొదలు…ఏది కొస. బీసీల గురించిన ప్రవచనాలు పలుకుతున్న మహాత్ములారా! బాబూ! తొంభైమూడు కులాల పేరుపేరునా చదివినందుకు ధన్యవాదాలు. కానీ వాళ్లేం చేస్తారో? ఏమి చేసి బతుకుతారో? వాళ్ల బతుకు ఏ సర్కర్తీగలు తెగిన వీణలయ్యాయో? తెలుసా! పురి తప్పిన దారం ఎక్కడ తెగిపోతుందో? కూలిపోయిన మగ్గా న్ని అడుగు.
నోర్మూసుకోండి… మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
ప్రపంచ బ్యాంకు రుణాలొస్తు న్నాయి. అభివృద్ధి పధాన పయనిస్తున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు తీసుకోండి, నిధులు పారుతున్నప్పుడు కాసుల గలగలతో అభివృద్ధి పధంలో మాత్రమే నడవండి… అందాకా…. కాస్త నోరు మూసుకోండి.
కొంచెం నోరు మూసుకుంటారా! ఆవల చాలా అభివృద్ధి చెయ్యాల్సి ఉన్నది. భూమిని చాప చుట్టాల్సి ఉన్నది. ఈ మహానగరం చుట్టూ రింగురోడ్డు మహాసర్ప పరిష్వంగాన్ని బిగించాల్సి ఉన్నది. కొంచెం ఆ గొణగడం… సణగడం ఆపుతారా! బుల్డోజ్ చేస్తున్న అభివృద్ధి పథ ఘట్టన ల్లో రణగొణ, గణగణ గంటల మోతల మధ్య మాటలెందుకు? వీరప్ప మొయిలీ కర్ణాటక అయినా ఆయనకు తెలంగాణ నాడి బాగా తెలుసు. తెలంగాణ ఆత్మలు మాట్లాడుకుం టున్న ఘోషలూ తెలుసు. అందుకే ఛీ అని కొందరు పనిలేని వాళ్లు ప్రేలాపనలు చేసినా తెలంగాణకు రెండో ఎస్సార్సీయే పరిష్కారం అంటే అని వుండవచ్చు కాక.
‘శోష’ లిజం మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.1 comment so far
- అల్లం నారాయణ
సారీ.. డియర్ లేట్ రాబర్ట్ ఓవెన్. సోషలిజం ఇంకెంత మాత్రం మాకు ఒప్ప దు. పెట్టుబడిదారీ దేశంలో ఒక పెట్టుబడి దారుగా.. సమాజ గర్భంలో పెట్టుబడిదారీ సమాజం తెచ్చిన అసమానతల, రెండు భిన్న ప్రపంచాల, పెరుగుతున్న అంతరాల మహా స్వరూపం నీకు అర్థమైనట్టుగా.. ఇన్నాళ్లకు మాకు అర్థం కానందుకు సారీ ఓవెన్.. అయితే మేం కమ్యూనిస్టులం.. కాదుకాదు మార్క్సిస్టులం.. ఒకరొకరుగా ఆఖరు దుర్గం గా భ్రమపడిన తల నిజంగానే పండిన స్వప్రకటిత మార్క్సిస్టు మేధావులు లొంగిపోతున్నారు. సామ్యవాదానికి ముందు పెట్టుబడి దారీ విధానం భారతీయ సమాజంలో ..కాదు కాదు.. బెంగాల్లో సామాన్యుడికి, పెట్టుబడిదారునికి, మధ్య తరగతికి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తుందని, ఉపాధి కల్పిస్తుందని, ఉద్యోగాలిస్తుందని కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య(సింగూరు, నందిగ్రామ్ఫేమ్), ముందూ.. ఆయన వెనుక తోక కురువృద్ధుడు జ్యోతిబసు బయలు దేరారు.
ఎవ్రీబడీ క్రైస్… మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
తలుపు తోసుకుని మృత్యువు అనాగరికంగా, అమెరికాలాగా వస్తుందని ఊహించి ఉండమేమో కదా! కిరణ్ దుఃఖం మా కుటుంబాన్ని వదలడం సాధ్యమా! పనిలో సరే! పదిమందిలో సరే! భ్రాంతిలో ఏకాంతంలో జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా, శకలాలు శకలాలుగా అంతూ దరీలేని శోకం వెన్నాడి ఉండడం మేమెప్పుడూ ఎరగం. సాదాసీదా మనుషులం. యవ్వన ప్రాభవాల్లో తెలిసిన మృత్యువుతో సయ్యాటలాడిన వాళ్లం. తెలిసిన శత్రువుతో యుద్ధాలు చేసిన వాళ్లం. చెట్లకు కట్టిన తరువాత కూడా కరుడుగట్టిన రాజ్యానికి కరుణ కలుగుతుంది. ఇది స్వదేశీ మృత్యు రహస్యం అని తెలుసుకోగలిగిన అనుభవం పొందిన వాళ్లం. ఎల్లలెరగని సరిహద్దుల్లో జ్ఞాత, అజ్ఞాత బతుకుపొరల్లో తృటిలో, కనుమెరుపు చాటున బతికి బట్టకట్టిన మామూలు మనుషులం.
విరోధాభాస మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.add a comment
- అల్లం నారాయణ
కడుపులో పుట్టెడు జ్వరం-నలభై ఐదు డిగ్రీల ఎండకాస్తున్నట్లు- ‘విస్వూయస్’ అగ్నిపర్వతం అంటుకున్నట్టు. జ్వరమాని కొలమానం దాటుతున్నది-నూటా ఆరు డిగ్రీల జ్వరం.మెదడులో పేలుతున్నవి జ్వరమృదంగపు ధ్వనుల ప్రేలాపనలు.
(ఇంకా…)
‘నాతోని గాదు’ మార్చి 29, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Pranahita.4 comments
- అల్లం నారాయణ
నిజామ్కు మొక్కుమంటవా !
దొరా !
నీబాంచెన్.
నిజాం ఏడేడు తరాలకు
దండేసి దండం పెట్టమంటవా !
ఆయనకే కాదు. తెలంగాణను పొరుకపోడుచేసిన జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, రెడ్లు, వెలమదొరలకు కూడా సాగిలపడి సలామ్ చెయ్యమంటవా ! ఎన్నేండ్లు మొక్కమంటవు.ఎన్నేండ్లు బాంచెగిరిచెయ్యమంటవ్.
(ఇంకా…)
‘తాజా’ సంక్షోభం మార్చి 29, 2008
Posted by Telangana Media in Pranahita.add a comment
- అల్లం నారాయణ
వేలమంది ఏకైక జీవ నాధారమైన సహస్ర వృత్తుల సమస్త జీవన వ్యాపారాలను కూలగొట్టే- నయా, తాజా కుట్రల గుట్టేమిటి ? ఇక ఏమి మిగిలింది? అరకిలో వంకాయలు, పావుకిలో బెండకాయలు, కిలో టమాట, కొంచెం ఉప్పు, కొన్ని మిరపకాయలు, కొంతపప్పు.. తోడుగా ఒక సంచీ, మూడురోజులయినా శీతలం దెబ్బకు వాడిపోని వంకాయ, అద్దాల్లోంచి మెరుస్తున్నది. తళతళలాడే టమాట ఊరిస్తున్నది. పైపూతలు భ్రమింపజేస్తున్నవి. (ఇంకా…)
తెలంగాణకు అధిష్ఠానమే అడ్డు! మార్చి 15, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
వైఎస్ దేముంది
ఉంటే రాజ్భవన్లో ఉండేవాడిని
కేవీపీ నాకు ద్రోహం చేశారు
ఉప ఎన్నికల్లో పోటీ చేయకుంటే మంచిది
అధిష్ఠానం ఏమంత బలంగా లేదు: ఎమ్మెస్
హైదరాబాద్ – న్యూస్టుడే
కాంగ్రెస్ సీనియర్ నేత
ఎం.సత్యనారాయణరావు మరోసారి సంచలనం సృష్టించారు. ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానమే అడ్డని ప్రకటించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మనోభావాలతో సంబంధం లేకుండా… అధిష్ఠానం ఇవ్వదల్చుకుంటే తెలంగాణను ఇచ్చేయొచ్చని అన్నారు. ముఖ్యమంత్రి సన్నిహితుడు కేవీపీ తనకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. వైఎస్కు తానిచ్చినంతటి మద్దతును ఎవరూ ఇవ్వలేదని, దీనికోసం తాను ఇతర కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఇబ్బందులెదుర్కొన్నానని ఆవేదన చెందారు. శాసనసభ లాబీల్లో ఎమ్మెస్ విలేకరులతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలు… ఎమ్మెస్ స్పందనలూ…
తెలంగాణ బంద్ సంపూర్ణం మార్చి 15, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
జిల్లాల్లో విజయవంతం
రాజధానిలో పాక్షికం
సచివాలయ ముట్టడికి యత్నం
అగ్రనేతల అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా 8వేల మంది అదుపులోకి
తెలంగాణ సాధించేదాకా నిద్రపోం మార్చి 14, 2008
Posted by Telangana Media in Vaartha.add a comment
భువనగిరి టౌన్, మార్చి 13, ప్రభాతవార్త మా ఒంట్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తోంది. తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కళ్ళప్ప గించి చూస్తూ ఊరుకోమని, పదవులనైనా,ప్రాణాలైనా లెక్కచేయకుండా తెలంగాణ సాధించితీరుతామని ప్రాంతీయ బోర్డు చైర్మన్, ఉప్పునూతల పురుషోత్తమ్రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి టిఎన్జిఓస్ భవనంలో తెలంగాణ జర్న లిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్రెడ్డితో కలిసి పాల్గొని ప్రారంభసందేశం ఇచ్చారు. ఆంధ్ర మహాసభలాంటి ఎన్నో ఉధ్యమాలు ఇక్కడ నుండే ప్రారంభమయ్యాయని తాము సైతం ఇక్కడనుండే ప్రారంభించి విజయవంతం అవుతామనే ధృఢ విశ్వాసం ఉందని ఉప్పునూతల ఆశాభావం వ్యక్తం చేసారు.శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం సిద్దించటం మేడిపండు లాంటిదైతే, దారిద్య్రం రాచ పుండులాంటిదని అభివర్ణించారు.ఆంధ్ర వలస పాలకుల అణచివత నుండి విముక్తులమౌదామని శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు పురుషోత్తమ్రెడ్డి, శ్రీధర్రెడ్డి సమాధాన మిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ గోవర్థనాచారి స్వాగతం పలుకగా, ఫోరం రాష్ట్ర కమిటి సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అధ్యక్షత వహించగా ఫోరం రాష్ట్ర కో కన్వీనర్ పిట్టల శ్రీశైలం సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రశ్న: 1969 తెలంగాణ ఉధ్యమంలో సమైఖ్యాంధ్రకు మద్దతు తెలిపి ప్రస్తుతం తెలంగాణ కోసం ఉధ్యమానికి దిగటం ఎంత వరకు సమంజసం? జవాబు: భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలిసి ఉండేందుకు అభ్యంతరం లేదనే ఉద్దేశ్యంతో మద్దతు పలికిన మాట వాస్తవం. ఆంధ్ర మద్రాసు కలిసి ఉండేది. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంది. మద్రాసునుండి ఆంద్ర విడిపోయి కర్నూలు రాజధానిగా చేసుకున్నారు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేనికారణంగా పధకం ప్రకారం తెలం గాణతో మిలాఖత్ కోరారు. ఇంతగా అన్యాయం జరుగుతుందని ఊహించలేక పోయాము. ప్రశ్న: ఐటిమంత్రి దామోదర్రెడ్డిమీపై పోటీచేసి గెలుస్తాననిసవాల్ విసిరారు. దీనికి మీ సమాధానం? జ: మొదట నీవు రాజీనామా చేయి. ఆ తర్వాత నేను రాజీనామా చేస్తాను. సవాలుకు నేను సై. ప్ర : పురుషోత్తమ్రెడ్డి పార్టీ నుండి బయటకు వెళ్ళినా పార్టీకి నష్టం జరగదని కొందరు కాంగ్రెస్ నేతల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా ? జ: అనుభరాహిత్యంతో ఎవరో ఏదో అంటే నిజమౌ తుందా? గత ఎన్నికల్లో జిల్లాలో 2,3 సీట్ల కంటే రావని నిర్ధారించుకున్నప్పుడు తాను పార్టీకొరకు శ్రమించి అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు కృషి చేసిన విషయం ప్రజలకు తెలుసు.నాకేదో శాపంఉందని, వీటిని ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇక ఏ మాత్రం వెనుకకు తగ్గేది లేదన్నారు. ప్ర: ఏదో ఒక పదవిని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రాంతీయ బోర్డు చైర్మన్ పదవిని స/ష్టించి నియమించిందని పలువురు అభిప్రాయపడటమే కాక, మీరు సైతం విధులు, నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేసారు కదా. ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? జ: నిజమే. అయితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు పరిశీలించేందకు వెళ్ళినప్పుడు అధికారాలుంటేనే కదా ఇంజనీర్లు, ఇతర అధికారులు మాట వింటారు.
ప్రత్యేక తెలంగాణలో నక్సల్స్కూ బాధ్యతలు మార్చి 14, 2008
Posted by Telangana Media in Eenadu.1 comment so far
ఉప ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మావే మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.add a comment
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మార్చి 11 (ఆన్లైన్): తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన లోక్సభ,శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో మెజారీటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శాసనసభా ప్రాంగణంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
నేనెందుకు రాజీనామా చేయాలి: దామోదర్రెడ్డి మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.add a comment
హైదరాబాద్, మార్చి 11 (ఆన్లైన్): “పార్టీలను మార్చే అలవాటున్న ఉప్పునూతల నేను రాజీనామా చేయాలంటూ సవాల్ చేయడం అర్థరహితం. నేనెందుకు రాజీనామా చేయాలి”- అని మంత్రి దామోదర్రెడ్డి అన్నారు. తెలంగాణ అంశాన్ని సోనియా చేతుల్లో పెట్టామని, ఆమె ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, రాజీనామాలు చేయబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
తెలంగాణ కోసం మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008
Posted by Telangana Media in AndhraJyothy, Telangana news.1 comment so far
తలవంచేది లేదు పీఠమెక్కించిన గులాబీ కండువే కాలనాగై కాటేస్తుంది
అభినందన సభలో కాంగ్రెస్కు కేసీఆర్
హెచ్చరిక కాంగ్రెస్ను నిలదీయండి: జయశంకర్
హైదరాబాద్, మార్చి 11 (ఆన్లైన్): తెలంగాణ కోసం అవసరమైతే మెడలు కోసుకుంటామే తప్ప ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచేది లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలకు పదవులు, కిరీటాలు తెచ్చిపెట్టిన గులాబీ కండువాయే కాలనాగై కాటేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ విషయంలో పూటకో మాట,పేటకో మాట మాట్లాడుతూ.. బద్మాష్ గిరీ చేస్తోన్న కాంగ్రెస్ నేతలు అంతకు అంత అనుభవిస్తారని ఆయన శపించారు. ఇటీవల సామూహిక రాజీనామాలు చేసిన టీఆర్ఎస్ నేతలకు మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. “గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలతో ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు.
మెడలు కోసుకుంటాం మార్చి 12, 2008
Posted by Telangana Media in Eenadu, Telangana news.add a comment
మెడలు కోసుకుంటాం
రాజీలేని పోరు చేస్తాం
తెలంగాణ ఇస్తరో, ఇయ్యరో సీదా చెప్పుండ్రి
కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ సవాల్
హైదరాబాద్ – న్యూస్టుడే
”ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దిశగా అంతిమపోరాటం ఆసన్నమైంది. ప్రజలు, విద్యావంతులు, ఉద్యోగుల దీవెనలు మాకున్నాయి. తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజీలేని పోరాటం చేస్తున్నం. ఇందుకోసం మెడలు కోసుకుంటాం తప్ప మెడలు వంచం.






